కంగ్టి లో ఘనంగా గణనాధుని పూజలు

కంగ్టి లో ఘనంగా గణనాధుని పూజలు

పూజలో పాల్గొన్న దిశ రిపోర్టర్ సంతోష్, దంపతులు

జనం న్యూస్ సెప్టెంబర్ 10, కంగ్టి  సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని యోగి గణేష్ మండపంలోని గణనాధుని మంగళవారం దిశ రిపోర్టర్ సంతోష్ రెడ్డి దంపతులు ఘనంగా పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక మండలకేంద్రంలోని గణనాథులతో పాటు     మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో మంగళవారం నాలుగో రోజు గణనాథులు పూజలందుకున్నారు. గణనాధుని మండపాల్లో గణనాథులకు ఆర్చకులు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. గణనాధునికి ప్రజలు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. సాయంత్రం వేళ్లలో మండపాల వద్ద యువకులు ఆటపాటలతో సందడి చేస్తున్నారు. కంగ్టిలోని యోగి గణేష్, సిద్ధి వినాయక మండప నిర్వాహకులు మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు,పురుషులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.