కాగిత రామచంద్రపురంలో పర్యటించిన కేంద్ర బృందం

కాగిత రామచంద్రపురంలో పర్యటించిన కేంద్ర బృందం

జనం న్యూస్ సెప్టెంబర్ 12(నడిగూడెం)భారత ప్రభుత్వం నుండి ఆరుగురు సభ్యుల అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం సలహాదారులు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కల్నల్ కె పి సింగ్, ఆర్థిక మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మహేష్ కుమార్, వ్యవసాయ రైతుల సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ శాంతినాథ్ శివప్ప కాగి, రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎస్ కె కుష్వాహ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నియల్ కన్సన్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇస్రో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ డాక్టర్ శశి వర్ధన్ రెడ్డిలు వరద ప్రభావిత గ్రామాల్లో కేంద్ర బృందం గురువారం పర్యటించింది.గ్రామాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలను జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్, కేంద్ర బృందం తో కలిసి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వారి వెంట ఆర్డిఓ సూర్యనారాయణ, తహసీల్దార్ సరిత, ఏ ఈ,ఏవో, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.