మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన ఎస్ఐ సిహెచ్ గణేష్

మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన  ఎస్ఐ సిహెచ్ గణేష్

జనం న్యూస్ సెప్టెంబర్ 11 రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ ప్రతినిధి దినేష్ 

ముస్తాబాద్ మండల కేంద్రంలోని పోతుగల్ జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో ఎస్ జి ఎఫ్ మండల స్థాయి పాఠశాలల క్రీడోత్సవాలలో భాగంగా జెండా ఆవిష్కరణ చేసి అండర్ 14 మరియు అండర్ 17 బాలికల కబడ్డీ, వాలీబాల్, కోకో పోటీలను ఎస్సై సిహెచ్ గణేష్ప్రా రంభించారు. విద్యార్థినులతో కలిసి సరదాగా కాసేపు ఆటలు ఆడారు. ఈ సందర్భంగా ఎస్ఐ సిహెచ్ మాట్లాడుతూ క్రీడా పోటీలలో పాల్గొడానికి వచ్చిన విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు ఆట పోటీలలో గెలుపులు ఓటములు సహజం కాబట్టి గెలిచినా ఓడిన బాధ పడవద్దు అన్నారు.మీరు ఇప్పుడు మండల పోటీలలో గెలిచి రేపు జిల్లా,రాష్ట్ర జాతీయ స్థాయికి చేరి తల్లిదండ్రులకుమీ ఊరికి మీ పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.పాఠశాలలో క్రీడలలో నైపుణ్యత కనబరిచిన విద్యార్థులు ఇంకా ముందుకు సాగడానికి నా ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుంది అని అన్నారు. ఇట్టి ఆటలకు భోజన సదుపాయం సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి గారు అలాగే బహుమతుల ప్రధానం మాజీ జెడ్పిటిసి గుండం నర్సయ్య గారు అందిస్తున్నారు వారికి ఎస్జీఎఫ్ తరఫున ధన్యవాదాలు తెలిపినారు.ఇట్టి కార్యక్రమంలో మండల నోడల్ అధికారి రాజిరెడ్డి,పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణన్ రావు,అతిధులు స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ గణేష్, మాజీ జెడ్పిటిసి గుండం నరసయ్య, మాజీ ఎంపీటీసీ గజ్జలరాజు, పెద్దిగారి శ్రీనివాస్ ,పలు పాఠశాల క్రీడాకారుల ఉపాధ్యాయులు,విద్యార్థిని విద్యార్థులు ,తదితరులు  పాల్గొన్నరు.