అండగా మేముంటాం..

అండగా మేముంటాం..

జనం న్యూస్ సెప్టెంబర్ 11 రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ప్రతినిధి దినేష్

పేదవాళ్లకు సహాయం చేయడమే మా లక్ష్యం అంటున్న  పోచమ్మ యూత్ సభ్యులు. 

 ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని కెసిఆర్ నగర్ కాలనీలో ఇటీవల నిరుపేద కుటుంబానికి చెందిన కటికే బాల్ లక్ష్మి అనే మహిళా అనారోగ్యంతో మృతి చెందగా, ఇట్టి విషయాన్ని తెలుసుకున్న పోచమ్మ యూత్ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. పోచమ్మ యూత్ తరపున 50 కిలోల బియ్యాన్ని అందించడం  జరిగింది. అలాగే వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పడం జరిగింది.ఎక్కడ ఏ సమస్య ఉన్న ముందుండి ఆ సమస్యను పరిష్కారం చేస్తామని  పోచమ్మ యూత్ తరఫున చెప్పడం జరిగింది. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమం లో పోచమ్మ యూత్ సభ్యులు పాల్గొన్నారు.