ప్రాణం తీసిన రాంగ్ రూట్.. కళ్ళ ముందే పోయిన ప్రాణం. (వీడియో చూడండి)

జనం న్యూస్: కూకట్పల్లి కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ వద్ద హైదర్నగర్లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాంగ్ రూట్లో వచ్చిన ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న పిమిడి చిన్నారావు (40) అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలై.. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఇందుకు కారణం బైక్ లో వస్తున్న వ్యక్తి రాంగ్ రూట్లో రావడమే అని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు