ప్రైవేట్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ రూ.2 లక్షల విరాళం

ప్రైవేట్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ రూ.2 లక్షల విరాళం

జనం న్యూస్ 22 సెప్టెంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్ విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ స్కూల్స్‌ మేనేజ్మెంట్‌ అసోసియేషన్‌, విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూ.2 లక్షల విరాళాలని అందజేశారు. ఈ మేరకు చెక్కును ఎమ్మెల్యే అదితి గజపతి రాజును కలిసి సభ్యులు శనివారం అందజేశారు. వరద బాధితుల కోసం ముందుకొచ్చిన ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలను ఎమ్మెల్యే అభినందించారు.