ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే

ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే

జనం న్యూస్ 4-10-24 అందోల్ నియోజకవర్గం-జిల్లా సంగారెడ్డి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డు  సర్వే అందోల్ జోగిపేట పురపాలక సంఘం పరిదిలో పైలట్ ప్రాజెక్టు గా 17 వ వార్డు ను ఎన్నుకోవడం జరిగింది.అందులో భాగంగా జిల్లా కలెక్టర్  రెండు టీం లను ఏర్పాటు చేసి,నోడల్ ఆఫీసర్ ఆర్డీవో నీ నియమించారు.  శుక్రవారం రెండు టీములు 17వ వార్డు లో ఫ్యామిలీ బేస్ డేటా ఆధారంగా ఇంటింటి సర్వే వార్డు కౌన్సిలర్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు)ఆధ్వర్యంలో నిర్వహించుట జరిగినది.ఇందులో ఆర్డీవో  పాండ, పిడి మెప్మ, గీత, మున్సిపల్ కమిషనర్ తిరుపతి,  టీం సభ్యులు.భిక్షపతి గౌడ్,పండరి,ప్రసాద్,బాలకృష్ణ,నాగయ్య,అనిత,ఇతరులు పాల్గొన్నారు.