బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో -ఓం శ్రీ గురుబ్యోనమః వేడుక

బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో  -ఓం శ్రీ గురుబ్యోనమః వేడుక

జనం న్యూస్ 05 సెప్టెంబర్
విజయనగరం టౌన్
గోపికృష్ణ పట్నాయక్(రిపోర్టర్)
 బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఆది వారం హైదరాబాద్,ఉప్పల్ లోని శ్రీ సాయి త్రిశక్తి పీఠం దేవాలయంలో ఓం శ్రీ గురుభ్యోనమః వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న  కొత్తవలస మంగలపాలెం ఎంపీపీ స్కూల్ చైర్పర్సన్ సంతోషిని మరియు ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర నుండి కార్యనిర్వాహ అధికారి ఏలూరి నరస లక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదే విధిగా  విజయనగరం జిల్లా బ్రాహ్మణ సంక్షేమ వేదిక అధ్యక్షులు బ్రహ్మశ్రీ ఏలూరు వెంకటరమణమూర్తి శర్మ గారు మాట్లాడుతూ, బ్రాహ్మణ సంక్షేమ వేదిక అనేక రంగాలలో ఉన్న ప్రముఖులను గుర్తించి గౌరవించడం అద్భుతంగా ఉందని, విద్యారంగం లో ఉన్న బ్రాహ్మణులు ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివి, ఈ అత్యున్నత స్థానానికి రావడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. అహర్నిశలు వారు తమకున్న పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ, నిత్యం విద్యార్థిలా శ్రమపడు తూ,సమాజంలో వస్తున్న మార్పులను తెలుసుకుంటూ, వాటిని రాబోయే తరానికి తెలియచేయడం గొప్ప విషయమని కొనియాడారు. గురువులందరు ధార్మిక కార్యక్రమాల కోసం తమ అమూల్యమైన సమయాన్ని కూడా కేటాయించి, బ్రాహ్మణత్వాన్ని కాపాడటానికి తమ వంతు ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. సన్మాన వేడుకలలో దాదాపు 250 మంది బ్రాహ్మణ గురువులకు బ్రాహ్మణ సంక్షేమ వేదిక కార్యవర్గ సభ్యులు బ్రాహ్మణ శ్రేష్ట బిరుదుతో ఘనంగా సత్కరించారు. సహా కార్యదర్శి గొల్లపల్లి ఫణిందర్ శర్మ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. అంతకుముందు నాట్యగురువులు లలిత, సౌజన్య బృందం దాదాపు 70 మంది చిన్నారులు నాట్య ప్రదర్శనలో పాల్గొని కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శనతో సభికులను అద్భుతంగా ఆకట్టుకున్నది.