ఖేడ్ డివిజన్ ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక అయిన ఎండి రహీమొద్దీన్,

ఖేడ్ డివిజన్ ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక అయిన    ఎండి రహీమొద్దీన్,

జనం న్యూస్,సెప్టెంబర్ 05,కంగ్టి 

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వీధి నిర్వహణలో ఉన్న ప్రధాన ఉపాధ్యాయుని బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఎండి రహీమొద్దీన్,ను    డివిజన్ ఉత్తమ ఉపాధ్యాయునిగా జిల్లా విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృత్తి ధర్మంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే నిరుపేద విద్యార్థులకు చదువుతోపాటు, క్రమశిక్షణను,సర్వసభ్య సమాజంలో ఉన్నతంగా జీవిస్తూ, తమ పేరు ప్రతిష్టలను సాధించాలన్నదే తన లక్ష్యమని అన్నారు.  ఉత్తమ ఉపాధ్యాయునిగా జిల్లా అధికారులు  గుర్తించడంతో         తనపై మరింత పని భారం పెరిగిందని అన్నారు.ఈ సందర్భంగా అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ తట్టి సావిత్రి వీరేశం,కేంద్ర ప్రాథమిక పాఠశాల చైర్మన్ కొమ్ము గంగామణి,పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు .