భారత జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

భారత జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

జనం న్యూస్ సెప్టెంబర్15 రాజన్న  సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ప్రతినిధి దినేష్ 

ముస్తాబాద్  పట్టణంలో బిజేపి మండల అధ్యక్షులు అంజా గౌడ్  ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి *ముఖ్య అతిథులుగా రాజన్న సిరిసిల్ల జిల్లా సభ్యత్వ నమోదు జిల్లా కన్వీనర్ మల్లారపు సంతోష్ రెడ్డి హాజరయ్యారు.అంజా గౌడ్  ముఖ్యఅతిథి గార్లు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈనెల 2వ తేదీన మన ప్రియతమ నాయకులు భారత ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదును 02 సెప్టెంబర్లాఛనంగాప్రారంభించారు.ప్రారంభించిన 12 రోజుల్లోనే 2 కోట్ల 50 లక్షల సభ్యత్వలు నమోదు అయ్యాయని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని గతంలో 12 కోట్ల బిజేపి సభ్యత్వం ఈ దేశంలో తీసుకుని ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించి గిన్నిస్ రికార్డు నెలకొల్పిందని,భారతీయ జనతా పార్టీ మాత్రమే దేశం కోసం ధర్మం కోసం పనిచేసే ఏకైక పార్టీ అని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త దేశం మొదట ఆ తర్వాతే పార్టీ ఆ తర్వాతే వ్యక్తిగతం అనే ప్రతి కార్యకర్త ఈ విధంగా పనిచేయాలన్నారు.. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మల్లారెడ్డి జిల్లా కార్యదర్శి మీస సంజీవ్, మండల ప్రధాన కార్యదర్శి బాధ నరేష్, ఓబీసీ మొర్చ చిగురు వెంకన్న, నాయకులు శ్రీనివాస రావు, జిల్లెళ్ల మల్లేశం,ఎదునూరి గోపి శంకర్, గూడ, బాలరెడ్డి, పప్పుల శ్రీకాంత్,సత్తయ్య, కార్తీక్, కోలా కృష్ణ,తదితరులు పాల్గొన్నారు