క్రీడలు విద్యార్థులకు ఎంతో అవసరం

క్రీడలు విద్యార్థులకు ఎంతో అవసరం

 జనం న్యూస్ ;11 సెప్టెంబర్ బుధవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి మానసిక, శారీరక ఎదుగుదలకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని జిల్లా విద్యాధికారి రాధాకిషన్ అన్నారు. ఎస్జీఫ్  క్రీడలలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేలి ఘనపూర్ నందు మండల స్థాయి క్రీడలు జరిగాయి. క్రీడలను ప్రారంభించిన సందర్భంగా జిల్లా విద్యాధికారి రాధాకిషన్ మాట్లాడుతూ క్రీడలలో గెలుపు ఓటములు సహజమని విద్యార్థులందరూ క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలని అన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి నీలకంఠం, ప్రధానోపాధ్యాయులు కరుణాకర్, మండల నోడల్ అధికారి మధుమోహన్, వ్యాయామ ఉపాధ్యాయులు మధుసూదన్, సత్యం, రాజశేఖర్, రాజేశం, అశోక్, దేవుల, రమేష్ మండలంలోని క్రీడా విద్యార్థులు పాల్గొనడం జరిగింది.