మొక్కలు నాటడం అంటే దైవకార్యంతో సమానం

మొక్కలు నాటడం అంటే  దైవకార్యంతో సమానం

జనం న్యూస్ సెప్టెంబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ప్రతినిధి దినేష్

ముస్తాబాద్ మండలంలో శుక్రవారం ఎక్సైజ్ శాఖ, ముస్తాబాద్ గీత కార్మిక సంఘం,మండల ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో రెండు ఎకరాల స్థలంలో ఈజీఎస్ నిధులనుండి 2 వేల ఈత మొక్కలను నాటారు.ఇట్టి కార్యక్రమానికి ఎక్సైజ్ సూపర్ండెంట్ పంచాక్షరి సిఐ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాలని, ఈత  మొక్కల యొక్క ప్రాముఖ్యతను గురించి గౌడ కులస్తులకు వివరించారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ సూపర్డెంట్ పంచాక్షరి, సిఐ శ్రీనివాస్,గౌడ్ సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ గుండెల్లి శీను, రాజారామ్, యాదగిరి, బాలయ్య, ఎల్లయ్య, గంగయ్య, ఆంజనేయులు, దేవేందర్, బాలసాని శ్రీనివాస్, ఈజీఎస్ అధికారులు, పంచాయతీ కార్యదర్శి రమేష్, గౌడ కులస్తులు, తయ్యారులుపాల్గొన్నారు