వైభవంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చనలు

వైభవంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చనలు

జనం న్యూస్ 13 సెప్టెంబర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ప్రతినిధి దినేష్

ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం మహిళలు సామూహిక కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు.వేద బ్రాహ్మణ పండితుల మంత్రోచ్ఛారణలతో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని పీటలు ఏర్పాటు చేసుకొని పసుపు కుంకుమలతో సామూహిక కుంకుమార్చనలు చేశారు.ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘ సభ్యులు, సభ్యురాలు, తదితరులు పాల్గొన్నారు..