రోడ్డు ప్రమాదంలో ఎస్ఐకి తీవ్ర గాయాలు చితికిపోయిన కాలు.

రోడ్డు ప్రమాదంలో ఎస్ఐకి తీవ్ర గాయాలు చితికిపోయిన కాలు.

జనం న్యూస్ కర్నూలు: ఎమ్మిగనూరు మండలం కందనాతి మాచమానదొడ్డి గ్రామం మలుపు దగ్గర ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో బైకు, ఆటో ఢీకొని ఎస్ఐకి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన కాలు పూర్తిగా విరిగిపోయి చితికిపోయినట్టుగా కనిపించింది. ఈయన స్కూల్ విద్యా కమిటీ ఎన్నికల విధులకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎమ్మిగనూరు మండలం రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ బాల నాయక్ ను చికిత్స కోసం వెంటనే కర్నూలు మెడికల్ కళాశాలకు తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.