వినాయకుడికి 108 రకాల నైవేద్యాలు చేసిన ఆర్యవైశ్య సంఘం భక్తులు..

వినాయకుడికి 108 రకాల నైవేద్యాలు చేసిన ఆర్యవైశ్య సంఘం భక్తులు..

జనం న్యూస్ సెప్టెంబర్ 15 రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ప్రతినిధి దినేష్ 

ముస్తాబాద్ మండల కేంద్రంలో  గణపతి నవరాత్రులు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం   వినాయక కమిటి ఆద్వర్యంలో ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. కాగా 9వ  రోజు భక్తులు వినాయకుడికి భారీ నైవేద్యాన్ని సమర్పించారు. 108 రకాల పిండి వంటలు, స్వీట్లను స్వామి వారి ముందు ఉంచారు. మా గణపయ్య ఉండ్రాళ్లు ఒకటే కాదు ఎన్నో రకరకాల స్వీట్లను, పిండి వంటలను ఆరగిస్తాడు అనే విధంగా భారీ నైవేద్యాన్ని ఏర్పాటు చేశారు. గణపతి పూజ అయిన అనంతరం వచ్చిన భక్తులందరికీ 108 రకాల ఇంటి వంటలు కలిసిన భారీ నైవేద్యాన్ని భక్తులకు ప్రసాదంగా పంచారు. ఈ సందర్భంగా‌ పూజారి, అలాగే నిర్వాహకులు, మహిళలు మాట్లాడారు..గత కొన్ని  సంవత్సరాలుగా ముస్తాబాద్ పట్టణంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు వినాయక చవితి సందర్భంగా గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.. అయితే ఈ సంవత్సరం కూడా గతంలో వలె  స్వామి వారికి అత్యంత భారీ నైవేద్యాన్ని సమర్పించాలనే ఆలోచనతోనే అందరం కలిసి 108 రకాల పిండి వంటలు, స్వీట్లతో భారీ నైవేద్యాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు..ఈ కార్యక్రమంలో కూర బిక్షపతి,ఉప్పల చంద్రం, కూర సంతోష్, నార్ల సతీష్ ,నార్ల రామకృష్ణ, చందా రాములు ,అన్నమయ్య శ్రీను,గంపరాజు,పప్పుల  శ్రీకాంత్,మెడిశెట్టి రాజు,నార్ల శ్రీనివాస్,ఆర్వాపెళ్లి రాజు,పడమటిoటి  బాలకృష్ణ ,మహిళలు ,సంఘ సభ్యులు సభ్యురాలు,తదితరులు పాల్గొన్నారు.