ఉచిత న్యాయ సేవలపై అవగాహన

ఉచిత న్యాయ సేవలపై అవగాహన

జనం న్యూస్ 26 సెప్టెంబర్

విజయనగరం టౌన్ రిపోర్టర్

గోపికృష్ణ పట్నాయక్

విజయనగరం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలో న్యాయ అవగాహన సదస్సును బుధవారం నిర్వహించారు. జిల్లా మాజీ జడ్జి దుర్గయ్య, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి విజయ కళ్యాణి, తదితరులు ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని సూచించారు. విద్యాహక్కు చట్టంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గ్‌న్నారు.