రీల్స్‌ కోసం వెళ్లి ప్రాణాలపైకి తెచ్చుకున్నాడు

రీల్స్‌ కోసం వెళ్లి ప్రాణాలపైకి తెచ్చుకున్నాడు

జనం న్యూస్ 26 సెప్టెంబర్

విజయనగరం టౌన్ రిపోర్టర్

గోపికృష్ణ పట్నాయక్

బుడతనాపల్లి గ్రామం సమీపంలో ఉన్న తమరు గెడ్డలో యువకుడు గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమయ్యింది. గంట్యాడ ఎస్సీ కాలనీకి చెందిన ఇంటర్మీడియట్‌ విద్యార్థి రాళ్లపూడి పవన్‌ వద్ద రీల్స్‌ చేసే క్రమంలో జారిపడిన మృతి చెందినట్లు ఎస్సై సాయి కృష్ణ తెలిపారు. పోలీస్‌, రెవిన్యూ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని గెడ్డలో గల్లంతయిన పవన్‌ కోసం స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టి యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు.