*కంగ్టి లో తనుగుల జితేందర్ రావు జన్మదిన వేడుకలు*

*కంగ్టి లో తనుగుల జితేందర్ రావు జన్మదిన వేడుకలు*

*తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కంగ్టి శాఖ*

జనం న్యూస్, సెప్టెంబర్ 28,కంగ్టి 

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో శుక్రవారం తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కంగ్టి మండల అధ్యక్షులు షేక్ జలీల్ ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి తనుగుల జితేందర్రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ఎంతో ఉన్నతమైన జమీందారు కుటుంబంలో జన్మించి ఈ కాలంలో అన్నీ ఉన్నటువంటి తాను జమీందారుగా చలామణి అవ్వకుండా నిరంతరం పేద బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం పరితపిస్తూ నిరుపేద ప్రజల హక్కుల కోసం సమర శంఖంతో,పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని చేదోడు వాదోడుగా నిలుస్తూ వెన్నుదన్నుగా ముందుకు నడిపిస్తున్న మహోన్నతమైన మానవత ధర్మమూర్తిగా జర్నలిజం అంటే ప్రజల పక్షాన నిజం చెప్పాలన్న అక్షర సత్యాన్ని నర నరాల్లో నింపుకొని అసలైన జర్నలిజానికి స్వరూపుడిగా నిలిచిన ఏకైక మహనీయుడిగా ఈ దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న అంతరాల మీద తన కలంను పేద ప్రజలకు బలంగా ఉపయోగించి గొంతు ఎత్తలేని పేద ప్రజలకు తాను గొంతుకనై కుల మత ప్రాంత లింగభేదం లేకుండా సర్వజనుల సంక్షేమం కోసం, సకలజనుల యోగక్షేమాల కోసం, నిరంతరం పోరాడే పోరాట యోధుడు మరో భానుడిగా తన పయనాన్ని ఆపకుండా కలం కార్మికుల పెద్దన్నయ్యగా డాక్టర్ జితేందర్ తనువుల అని అన్నారు.మీ జన్మదినం యావత్తు జర్నలిస్టు లోకానికి ఓ శుభదినం పండుగ దినమని అన్నారు. మీరు ఇలాగే మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ప్రత్యేకంగా కంగ్టి మండల శాఖ తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు షేక్ జలీల్, ఉపాధ్యక్షులు రెడ్డి వినోద్,యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.