సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ ఆగస్టు 6 ఆలేరు యాదాద్రి జిల్లా (మండల రిపోర్టర్ ఎండి జహంగీర్) ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్ మాట్లాడుతూ పిల్లలు అందరూ పాఠశాలకు తప్పకుండా హాజరుకావాలని, అన్ని పాఠ్యంశాల్లో మంచి ప్రగతిని సాధించి, స్కూల్ పేరును తీసుకురావాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. పూర్వ విద్యార్థులు చిట్టబోయిన. ప్రవీణ్, చాడ. రాజు, పాఠశాల ఉపాధ్యాయులు సంగి.ఇస్తారి, శ్రీమతి జె. అనుపమ, పాఠశాల పిల్లలకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సత్యవతి, శబ్రీన్ లింగేశ్వరరావు, సుకన్య, జోసోఫ్, శ్రీధర్, లక్ష్మణ్, సౌజన్య, కరుణాకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు,, తదితరులు, పాల్గొన్నారు.