జిల్లాస్థాయికి ఎంపిక విద్యార్థులకు అభినందన

జిల్లాస్థాయికి ఎంపిక విద్యార్థులకు అభినందన

రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ ప్రతినిధి దినేష్


గంభీరావుపేట మండలంలో జరిగిన మండల స్థాయి ఆటల పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లింగన్నపేట విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎన్నిక కావడం జరిగింది. బాలికలు మండల స్థాయిలో అండర్ 14 వాలీబాల్ బాలికల విభాగం లో మొదటి బహుమతి,అండర్ 17 బాలుర వాలీబాల్ విభాగంలో మొదటి బహుమతి పొందడం జరిగింది మరియు అండర్ 17  ఖో ఖో విభాగంలో ద్వితీయ బహుమతి పొందడం జరిగింది. అదేవిధంగా అండర్ 14 ల బాలురు విభాగంలో పరుగు పోటీలో 100 మీటర్ల లో ఎల్. హర్ష, రెండో బహుమతి 200 మీటర్లు మూడో బహుమతి పొందడం జరిగింది, పరుగుపందెంలో 200 మీటర్ల పరుగులో జి వైశాలి పదవ తరగతి విద్యార్థిని మూడవ స్థానంలో నిలిచి జిల్లా స్థాయికి ఎంపిక కావడం జరిగింది.  జిల్లా స్థాయికి ఎంపిక అయినందున పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల బృందము ఈ విద్యార్థులను అభినందించడం జరిగింది.