నడిరోడ్డుపై కొడుకును.. కోడలిని చితకొట్టిన మహిళ ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు (వీడియో చూడండి)

జనం న్యూస్: ఒక మహిళ తన కొడుకు, కోడలిని నడి రోడ్డు మీద విపరీతంగా కొడుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సాధారణంగా పిల్లలు తప్పు చేస్తే.. తల్లిదండ్రులు దండిస్తారు. అది కూడా ఓ వయసు వచ్చే వరకు. కానీ పెళ్లైన తర్వాత కూడా తల్లి.. పిల్లలను దండించడం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ ఈ వీడియోలో మహిళ మాత్రం.. కొడుకును, కోడలిని.. ఇద్దరిని నడి రోడ్డు మీద విపరీతంగా కొడుతుంది. దాంతో ఆ చుట్టు పక్కల ఉన్నవారు షాకవుతారు. కానీ ఆమె చుట్టూ ఉన్న వాళ్లు.. ఆమెను ఆపడానికి మాత్రం ప్రయత్నించరు. కారణం ఆమె మాట్లాడిన మాటలు. ఇంతకు సదరు మహిళ.. ఎందుకు వారిని అంతలా కొడుతుంది అంటే.. ఇంతకు ఈ వీడియోలో సదరు మహిళ.. తన కొడుకును, కోడల్ని ఎందుకు ఇంతలా కొడుతుంది అంటే.. వారు హెల్మెట్ ధరించలేదనే కారణం చేత. ఇందుకు సంబంధించిన వీడియోని @iammaya_sharma అనే ట్విట్టర్ ఖాతాలో షేర్‌ చేసింది. ‘హెల్మెట్ ధరించనందుకు కొడుకుకి రోడ్డుపై బుద్ధి చెప్పిన తల్లికి సెల్యూట్ చేయాలి’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో బైక్ మీద వెళ్తున్న కొడుకు, కోడల్ని గమనించిన సదరు మహిళ.. పరుగున వెళ్లి వారిని ఆపుతుంది. హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదని కొడుకుని కొట్టింది. ఆ తర్వాత కోడల్ని కూడా నిలదీసింది. ఇదంతా ప్రధాన రహదారిపై పోలీసులు చూస్తుండగానే జరిగింది. ఇక ఆ మహిళ చేసిన పనిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నా.. జరిమానాలు వేస్తోన్న జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక ఏటా రోడ్డు ప్రమాదాల కారణంగా.. ఎందరో ప్రాణాలు కొల్పోతున్నారు.. అంగ వైకల్యం బారిన పడుతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అయినా సరే.. జనాలు మాత్రం మారడం లేదు.. ట్రాఫిక్‌ పోలీసులు పెట్టిన రూల్స్‌ని పాటించడం లేదు. ఈ వీడియో చూసిన జనాలు.. పోలీసులు చెబితే వినడం లేదు.. కనీసం తల్లి చెప్తే అయినా వింటారేమో అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.