నర్సింలపల్లె గ్రామ పద్మశాలి యువజన సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక...

నర్సింలపల్లె గ్రామ పద్మశాలి యువజన సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక...

జనం న్యూస్ అక్టోబర్ 2 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం లోని నర్సింలపల్లె పద్మశాలి సంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఆధ్వర్యంలో పద్మశాలి సేవా యువజన సంఘం గ్రామ నూతన కార్యవర్గాన్ని బీర్పూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆవరణంలో పద్మశాలి యువజన సభ్యులు అంతా కలిసి ఏకగ్రీవంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గ్రామ పద్మశాలి యువజన సంఘ *అధ్యక్షులుగా భీమానాతి లవణ్* *గౌరవ అధ్యక్షులు గా కడారి prakash*, *ప్రధాన కార్యదర్శిగా చింతల సురేష్* , *ఉపాధ్యక్షులుగా ఎలిగేటి సురేష్* , *కోశాధికారిగా అంకం కిషోర్* ,*జాయింట్ సెక్రటరీ కడారి ప్రశాంత్* వారు ఎన్నికైనారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో పద్మశాలీల ఉన్నతికి కృషి చేస్తామని, పద్మశాలి సంఘాల అభ్యున్నతికి పాటుపడుతామని పద్మశాలీలంతా ఐక్యంగా ఏకతాటిపై ఉండేలా కృషి చేస్తామని తెలిపారు. *ఈ కార్యక్రమంలో మండల పద్మశాలి సంఘ గౌరవ అధ్యక్షులు మెరుగు రాజేశం, గ్రామ పద్మశాలి అధ్యక్షులు నరిమెట్ల సతీష్, మండల ప్రధాన కార్యదర్శి బొగ సత్తన్న మరియు గ్రామంలోని పద్మశాలి యువజన సభ్యులు తదితరులు పాల్గొన్నారు*