మట్టి గణపతులనే మనందరం పూజిద్దాం.....

మట్టి గణపతులనే మనందరం పూజిద్దాం.....

చిన్నగొట్టిముక్కుల ఉన్నత పాఠశాలలో విద్యార్థుల మట్టి గణపతుల తయారీ..
 జనం న్యూస్ సెప్టెంబర్6.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్  పర్యావరణ పరిరక్షణ కోసం వినాయక చవితి పండగకు ప్రతి ఒక్కరం కూడ మట్టి గణపతులనే పూజిద్దామని మండలంలోని చిన్నగొట్టిముక్కుల ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతినభూనారు. శుక్రవారం చిన్నగొట్టిముక్కుల ఉన్నత పాఠశాల విద్యార్థులతో పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు ఎల్లంకి నారాయణ గౌడ్ మట్టి విగ్రహాలను తయారు చేయించి,గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు.రసాయనాలు, కాలుష్య పూరిత వినాయకులను కాకుండా పూర్తిగా మట్టితో తయారు చేసిన గణేశుని విగ్రహాలను ప్రతిష్టించి పూజించడంతో పర్యావరణ కాలుష్యంతో పాటు డబ్బులు కూడ ఆదా చేసుకోవచ్చని విద్యార్థులకు వివరించారు. ఈకార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.