మరో ఛాన్స్... మిస్ కావొద్దు!

మరో ఛాన్స్... మిస్ కావొద్దు!

విజయనగరం 09 మే 2023 విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు రెండో దశలో సీట్ల కేటాయింపు ప్రక్రియను జిల్లా అధికారులు ప్రారంభించారు. 2023-24 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో 25శాతం సీట్లను కేటాయించే ప్రక్రియలో భాగంగా ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని విద్యాశాఖాధికారులు తాజాగా ప్రకటించారు. ఈ నెల 15లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంది. 22న లాటరీ తీయగా.. 24నుంచి ప్రవేశాలు కల్పిస్తారు.