వృద్ధుని అనుమానాస్పద మృతి

వృద్ధుని అనుమానాస్పద మృతి

జనం న్యూస్ జూలై 21 మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలో అనుమానాస్పదంగా వృద్ధుడు మృతి చెందడంతో. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్న సంఘటన శుక్రవారం మండల పరిధిలో వెలుగు చూసింది.పోలీసులు మరియు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం. మండల పరిధిలోని ముకుందాపురం గ్రామానికి చెందిన భయ్యా రోశయ్య, వయసు 70 సంవత్సరాల వృద్ధుడికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు సంతానం ఉండగా. తేదీ 21/ 7/2023 ఉదయం 11:30 గంటల సమయంలో మృతుని రెండవ కుమారుడైన భయ్యా ఉప్పలయ్య తన అత్తగారింటి నుంచి తిరిగి వచ్చేసరికి తన తండ్రి అయిన భయ్యా రోశయ్య ఇంటి ముందు వరండాలో మంచంపై స్పృహ లేకుండా పడి ఉండగా ఎంత పిలిచినా లేవకపోవడంతో. కుమారుడు అనుమానం వచ్చి చుట్టుపక్కల వారిని పిలవగా వారు వచ్చి పరిశీలించి చూడగా రోశయ్య అప్పటికే మరణించి ఉండటంతో మృతుని కుమారుడు ఉప్పలయ్య స్థానిక పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. ఉప్పలయ్య అందించిన సమాచారంతో స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తుల సమక్షంలో మృతుని మృతదేహాన్ని పరిశీలించగా మృతుడు రోశయ్య రెండు చేతుల మీద, ఎడమ కణత మీద చర్మం నల్లగా కమిలి ఉండటంతో అతని మరణం పై అనుమానం ఉన్నదని మృతుని రెండవ కుమారుడు భయ్యా ఉప్పలయ్య ఫిర్యాది మేరకు అనుమానస్పద మృతిగా క స్టేషన్ హౌస్ ఆఫీసర్ కారింగుల కృష్ణమూర్తి మునగాల పిఎస్ గారు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి నందు శవ పరీక్ష జరిపి అంత్యక్రియల నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అందించడం జరిగినది.