వెంబడిస్తూ... వెంటపడుతూ...

వెంబడిస్తూ... వెంటపడుతూ...

ఎక్కువ మొత్తంలో ఆసీలు చెల్లించాలంటూ ఒత్తిడి

ఆందోళనలో చిరు వ్యాపారులు, సరుకులు రవాణా వాహనదారులు

జనం న్యూస్. 06. ఏప్రిల్.(విజయనగరం జిల్లా. రాజాం) విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఎక్కువ మొత్తంలో ఆసీలు రుసుం చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నందుకు చిరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. నిబంధనలు అతిక్రమించి ఇష్టానుసారంగా ఆశీలు వసూలు చేసేందుకు సంబంధిత ఆసీలు పాటదారులు సిద్ధమవడంతో అసలే బేరాలు లేక ఇబ్బంది పడుతున్న చిరు వ్యాపారులు పెంచిన మొత్తాన్ని చెల్లించలేక సతమతమవుతున్నారు. ఒక్కసారిగా ఐదు నుంచి 15 రూపాయలు చొప్పున పెంచి వసూలు చేసేందుకు పాటదారులు సిద్ధమవుతున్నారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సరైన ఆదేశాలు జారీ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చిరు వ్యాపారస్తులు, సరుకులు రవాణా వాహనదారులు కోరుతున్నారు...