*స్వభావ స్వచ్చత - సంస్కార స్వచ్చత పక్షోత్సవాలు*

*స్వభావ స్వచ్చత - సంస్కార స్వచ్చత పక్షోత్సవాలు*

జనం న్యూస్,పార్వతీపురం మన్యం జిల్లా ,సెప్టెంబర్ 23, (రిపోర్టర్ ప్రభాకర్):సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పార్వతీపురం పట్టణంలో నిర్వహిస్తున్న 5 వసతిగృహ విద్యార్థులు, స్వభావ స్వచ్ఛత - సంస్కార స్వచ్ఛత పక్షోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం పార్వతీపురం పట్టణంలో, షెడ్యూల్డ్ కులముల సంక్షేమం మరియు సాధికారత శాఖ జిల్లా అధికారి మహమ్మద్ గయాజుద్దీన్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గయాజుద్దీస్ మాట్లాడుతూ విద్యార్థులకు స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత మరియు స్వచ్ఛత హి సేవ కార్యక్రమం ఉద్దేశాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సహాయ సాంఘిక సంక్షేమ అధికారిణి (ఎఫ్.ఏ.సీ) పి.రాణి, వసతిగృహ సంక్షేమ అధికారులు కె.దుర్గాప్రసాద్, కె. కురమమ్మ, ఎం.నాగమణి, ఎస్.కనకరాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు.