అమ్మనాన్న ట్రస్టుకు పులి మామిడి నవీన్ గుప్త ఆర్థికసాయం
తన స్వంత డబ్బులు 16 వేల రూపాయల విరాళం అందించిన కాంగ్రెస్ నాయకులు నవీన్ గుప్త..
పులిమామిడి నవీన్ గుప్తా కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన అమ్మానాన్న ట్రస్టు సభ్యులు..
జనం న్యూస్ సెప్టెంబర్6.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్
హైదరాబాద్ మహా నగరంలో అనాధ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్న అమ్మానాన్న ట్రస్టు అనాధ ఆశ్రమానికి శుక్రవారం మండల కేంద్రమైన శివ్వంపేటకు చెందిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పులిమామిడి నవీన్ గుప్త తనవంతు సహకారంగా తన స్వంత డబ్బులు 16 వేల విరాళాన్ని అందించి,అమ్మానాన్న ట్రస్ట్ లోని అనాధ చిన్నారులకు అండగా నిలిచారు. ఈసందర్బంగా శివంపేట మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు పులి మామిడి నవీన్ గుప్త మాట్లాడుతూ తన శక్తి మేరకు తనకు తోచిన విదంగా తన సంపాదన కొంత భాగం సేవ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తానని, అందులో భాగంగానే అమ్మనాన్న ట్రస్టుకు ఆర్థిక సహాయం అందించానని నవీన్ గుప్తా అన్నారు . అడిగిన వెంటనే కాదనకుండా తన స్వంత డబ్బులు 16 వేల రూపాయల ఆర్థిక సహకారం అందించిన దాత పులిమామిడి నవీన్ గుప్తకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అమ్మానాన్న ట్రస్టు నిర్వాహకులు అన్నారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ నాయకులు వారాల గణేష్, వంజరి నాగభూషణం, మాజీ కో ఆప్షన్ మెంబర్ దావుద్, వంజరి గౌరీశంకర్, బాసంపల్లి ప్రభులింగం గౌడ్, ఇసారపు రాజుగౌడ్, ఒర్రె మల్లేష్ యాదవ్, లస్కరి ఆంజనేయులు, మహేష్,అమ్మానాన్న ట్రస్టు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.