ఆరోగ్యశ్రీ ఆసుపత్రులలో ఆకస్మిక తనిఖీలు

ఆరోగ్యశ్రీ ఆసుపత్రులలో ఆకస్మిక తనిఖీలు

జనం న్యూస్ 29 సెప్టెంబర్

విజయనగరం టౌన్ రిపోర్టర్

గోపికృష్ణ పట్నాయక్

విజయనగరంలోని ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు శ్రీసాయి సూపర్‌ స్పెషాలిటీ, పుష్పగిరి ఆసుపత్రిలను శనివారం ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌ అప్పలరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్యమిత్ర విభాగంలో రికార్డును పరిశీలించారు. ఆరోగ్యశ్రీ వార్షులోకి వెళ్లి రోగులకు చికిత్స ఉచితంగా అందుతుందా? లేదా అని రోగులను అడిగారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా చికిత్స అందేలా చూడాలని ఆరోగ్యమిత్రకు సూచించారు.