**ఏర్గట్లవిద్యాశాఖాధికారి గా బాధ్యతలు స్వీకరించిన ఆనందరావు**

**ఏర్గట్లవిద్యాశాఖాధికారి గా బాధ్యతలు స్వీకరించిన ఆనందరావు**

జనం న్యూస్ సెప్టెంబర్ 25: నిజామాబాద్ జిల్లా యెర్గట్ల మండలము:రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాను ప్రకారం ఏర్గట్లమండల నూతన విద్యాశాఖ అధికారిగా బి ఆనందరావు ని నియమించడం జరిగింది. ప్రస్తుతం ఆనందరావు జడ్.పి.హెచ్.ఎస్ గుమ్మిరాల గెజిటెడ్ హెడ్మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్నారుదీనితో పాటు మండల నోడల్ ఆఫీసర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు అందరూ ఎంఎన్ఓ లని ఎఫ్ఎసి ఎంఈఓ గా నియమించడం జరిగింది. దానిలో భాగంగాబుదవారం రోజునా ఇంచార్జి విద్యాశాఖాధికారి అంద్రయ్య నుండి ఆనందరావు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలోఏర్గట్ల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కృష్ణమా చారి మరియు ఉపాద్యాయులు సన్మానం చేశారు.