కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ పార్టీ 

కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ పార్టీ 

జనం న్యూస్ సెప్టెంబర్(24) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో మంగళవారం నాడు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ నివాసంలో నియోజకవర్గంలోని మంచతండా గ్రామానికి చెందిన లకావత్ సోమ్లు, గుండెపురి గ్రామానికి చెందిన పాలకుర్తి వెంకన్న గత కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు మరణించడంతో వీరికి బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండడంతో ప్రమాద బీమా వర్తించింది. ఇందుకు సంబంధించిన రెండు లక్షల రూపాయల చెక్కులను తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ బాధిత కుటుంబ సభ్యులు లకావత్ జయమ్మ, పాలకుర్తి పద్మకు అందించినాడు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.