గాంధీ హాస్పిటల్లో ఒక్క నెలలోనే 48 మంది పసిపిల్లల్ని, 14 మంది తల్లులను పొట్టనపెట్టుకున్న

గాంధీ హాస్పిటల్లో ఒక్క నెలలోనే 48 మంది పసిపిల్లల్ని, 14 మంది తల్లులను పొట్టనపెట్టుకున్న

జనం న్యూస్ 18 సెప్టెంబర్ 2024. జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా గాంధీ హాస్పిటల్ 
వైద్యుల నిర్లక్ష్యం

అధికారిక లెక్కల ప్రకారం ఒక్క ఆగస్టు నెలలో ఒక్క గాంధీ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరియు పౌష్టిక ఆహార లోపం కారణంగా గర్భంతో ఉన్న 14 మంది మహిళలు మరియు 48 మంది అప్పుడే పుట్టిన చిన్న పిల్లలు చనిపోయారు.

ఈ విషయం 15 రోజులుగా బయటికి పొక్కకుండా తెలంగాణ ప్రభుత్వం దాస్తుండగా మా TeluguScribe మరణించిన వారి పూర్తి వివరాలు డేటాతో సహా సేకరించింది. గత ప్రభుత్వంలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార లోపం అధిగమించేందుకు ఇచ్చే న్యూట్రిషన్ కిట్ మరియు కేసీఆర్ కిట్ లను ఆపేయడం బరువు తక్కువగా పుడుతూ చనిపోతున్న పసిపిల్లలు.. అనుభవం లేని డాక్టర్లు ఆపరేషన్లు చేస్తుండటంతో మృత్యువాత పడుతున్న తల్లులు. అధికారిక లెక్కల ప్రకారం ఒక్క గాంధీ హాస్పిటలోనే ఇన్ని మరణాలు ఉంటే అనధికారిక లెక్కల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో గత 8 నెలల్లో ఇంకెంత మంది గర్భిణీలు మరియు చిన్న పిల్లలు చనిపోయి ఉంటారు. గాంధీ హాస్పిటల్లో గమనించిన మరికొన్ని సమస్యలు.. 

1. గాంధీలో రాజీవ్ ఆరోగ్య శ్రీ మెడికల్ కోఆర్డినేటర్గా ఒక్క ప్రొఫెసర్ లేదా సీనియర్ డాక్టర్ ఉండాల్సిన స్థానంలో ఒక్క రిటైర్డ్ జూనియర్ అసిస్టెంట్ రామయ్యని నియమించారు.

2. ఫ్యామిలీ & హెల్త్ డిపార్ట్మెంట్ మరియు చాలా ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి 4 నెలల నుంచి జీతాలు లేవు.

3. ఎక్పీరియన్స్ డాక్టర్లను గ్రామాలకు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల, గాంధీలో హైరిస్క్ కేసులు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన డాక్టర్స్ హ్యాండిల్ చేయలేక పోతున్నారు అందువల్ల డెత్స్ ఎక్కువ అవుతున్నాయి.

4. గాంధీ హాస్పటల్లో అసలు రివ్యూ జరగడం లేదు.

5. కేసీఆర్ కిట్ మరియు న్యూట్రిషన్ కిట్ 6 నెలల నుంచి ఆపివేశారు.

6. గాంధీలో గత ప్రభుత్వం ఇన్ ఫీటిలిటీ సెంటర్ మొదలు పెడితే కాంగ్రెస్ గవర్మెంట్ వచ్చిన అప్పటినుంచి ఒక్క కేసు కూడా ఫిటీలిటీ ట్రీట్మెంట్ చేయలేదు.. ఫీటిలిటి సెంటర్ మూసేసారు.

7. గాంధీ మెడికల్ కాలేజీలో సుమారు 15 సంవత్సరాల నుంచి పని చేస్తున్న D.E.O లను ఎలాంటి కారణం లేకుండా బడ్జెట్ లేదు అని తొలగించారు.