ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి.

ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి.

జనం న్యూస్ 05 సెప్టెంబర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం రిపోర్టర్ దినేష్

గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో,భక్తి శ్రద్ధతో జరపాలని సిఐ మొగిలి తెలిపారు.గురువారం ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీకృష్ణ యాదవ సంగం భవనంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సీఐ మొగిలి మాట్లాడుతూ మండపాల వద్ద ఎలాంటి సమస్యలు చోటు చేసుకోకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.గణేష్ ఉత్సవాలు సజావుగా సాగేందుకు పోలీస్ శాఖ వారి సూచనలు పాటించి సహకరించాలన్నారు.గణేష్ ఉత్సవాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పోలీస్ నిబంధనను ఉల్లంఘిస్తూ శాంతిభద్రతలకు విగుతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామనీ, ఎవరు కూడానిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని యువతను కోరారు.ఎవరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించుకోవాలని చెప్పారు.పోలీసులు అన్ని గ్రామాలలో ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ నిర్వహిస్తారని మండపాలను సందర్శిస్తారని, వారికి సహకరించాలని వివరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ గణేష్,కానిస్టేబుల్ కాసిం, మండలంలోని వినాయక మండపాల నిర్వహకులు,తదితరులు పాల్గొన్నారు.