*ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్*

*ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్*

*శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే*

అచ్యుతాపురం(జనం న్యూస్):తిరుమల శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో గత వైసీపీ ప్రభుత్వంలో జంతు అవశేషాలు కలపడంతో జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నిరసనగా 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్న దీక్షకు మద్దతుగా జనసేన ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ ఈ రోజు ఉదయం అచ్యుతాపురంలో ఉన్న శ్రీ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి సంఘీభావ దీక్ష చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి కలిపి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని, ఇటువంటి వారిని ఎవ్వరూ క్షమించకూడదని, తిరుమల పవిత్రతను అపవిత్రం చేసిన జగన్ రెడ్డి,సుబ్బారెడ్డి,కరుణాకర్ రెడ్డి,ధర్మారెడ్డి వీరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో శాసనసభ్యులతో పాటు నియోజకవర్గంలోఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.