బిఆర్ఎస్ కార్యకర్తలకు ఆపదలో అందరికంటే ముందుంటా ఆపద్బాంధవుడు

బిఆర్ఎస్ కార్యకర్తలకు ఆపదలో అందరికంటే ముందుంటా ఆపద్బాంధవుడు

తాజామాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త....

చెందిలో కుమ్మరి గోపాల్ కుటుంబానికి పరామర్శ...

ఆసుపత్రి ఖర్చులకు తన స్వంత డబ్బులు 10 వేల రూపాయలు అందించిన తాజా మాజీ జడ్పిటిసి  మహేష్ గుప్త.....

 జనం న్యూస్ అక్టోబర్21.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ 

 మెదక్ జిల్లా శివంపేట మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కార్యకర్తకు కూడ ఆపదలో ఆదుకోవడంలో  ముందుంటానని ప్రముఖ సంఘ సేవకులు ఆపద్బాంధవుడు శివంపేట  తాజామాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త అన్నారు. మండలంలోని చెంది గ్రామానికి  చెందిన మాజీ వార్డుసభ్యులు కుమ్మరి గోపాల్ - రాజమణి దంపతులు గత కొన్నిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం పార్టీ వర్గాల ద్వారా తెలుసుకున్న తాజామాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త సోమవారం గోపాల్ కుటుంబాన్ని పరామర్శించి, రోడ్డు ప్రమాదానికి గల కారణాలు, ప్రస్తుతం గోపాల్, రాజమణి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. గోపాల్ ఆసుపత్రి ఖర్చులకు తనవంతు సహాయంగా తన స్వంత డబ్బులు 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి, ఆర్థికంగా భరోసా కల్పించారు. ఈసందర్బంగా పబ్బ  మహేష్ గుప్త మాట్లాడుతూ పార్టీలో చురుకైన నాయకుడిగా ఉండే గోపాల్ రోడ్డు ప్రమాదంలో గాయపడడం బాధాకరమని, ఆయన కుటుంబానికి మరింత సహకారం అందిస్తామన్నారు  మహేష్ గుప్తా అన్నారు  ఈకార్యక్రమంలో మండల నాయకులు ముద్దగల లక్ష్మీనర్సయ్య, ముద్దగల్ల రాజు, గ్రామకమిటీ అధ్యక్షులు పుల్లగూర్ల ముత్యంరెడ్డి, నీలమొల్ల వెంకట్ రెడ్డి, ఏనుగు కృష్ణరెడ్డి, ఏనుగు బాల్ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, కర్రె వీరేష్, కుమ్మరి రాజయ్య, కుమ్మరి గిరి, తదితరులు పాల్గొన్నారు.