భారీ వర్షాలు కురవడంతో పలు గ్రామాలను సందర్శించిన మండల అధికారులు

భారీ వర్షాలు కురవడంతో పలు గ్రామాలను సందర్శించిన మండల అధికారులు

ఎమ్మార్వో విష్ణుసాగర్, ఎంపీడీవో సత్తయ్య,

జనం న్యూస్,సెప్టెంబర్ 02,

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమవారం  మండల పరిధిలోని పలు గ్రామాలను సందర్శించిన మండల అధికారులు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా    కలెక్టర్,ఖేడ్ ఆర్డీవో ఆదేశాల మేరకు కంగ్టి మండల పరిధిలోని పలు గ్రామాలను సందర్శించడం జరిగిందని అన్నారు.  ఇందులో భాగంగా  కంగ్టి, పీఎం దామరగిద్ద, ముర్కుంజాల్,చాప్ట కే,చెరువులను సందర్శించడం జరిగిందని అన్నారు. పలు గ్రామా పంచాయతీలలో పరిశుద్ధంపై,ప్రజలకు దిశ నిర్దేశం చేశారు.పలు గ్రామాలలో ఇండ్లు కూలడం,ఎటువంటి  ప్రాణనాష్టం జరగకుండా ప్రజలు సురక్షితంగా ఉన్నారని అన్నారు.భారీ వర్షాలు కురుడంతో ప్రజలు బయటకు రావద్దని మండల అధికారులు,మండల ప్రజలకు సూచించారు. ప్రమాదకరమైన సంఘటన జరిగినచో వెంటనే అధికారుల   దృష్టికి తీసుకురావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ సుభాష్, పంచాయతీ  కార్యదర్శి జ్ఞానేదేవ్, రెవెన్యూ సిబ్బంది రాహుల్,మోహన్, గ్రామస్తులు,  తదితరులు పాల్గొన్నారు.