భార్య గొంతు కోసి తాను కూడా గొంతు కోసేసుకున్న భర్త.. ఎందుకో తెలుసా..!

భార్య గొంతు కోసి తాను కూడా గొంతు కోసేసుకున్న భర్త.. ఎందుకో తెలుసా..!

జనం న్యూస్ : భార్యను కత్తితో గొంతు కోసి తాను కూడా అదే కత్తితో కోసుకొని ఆత్మహత్య యత్నం చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపింది. మండల కేంద్రమైన బేలకు 15 కిలోమీటర్ల దూరంలోని సయీద్పూర్ గ్రామానికి చెందిన యేసుల లక్ష్మణ్(32), సునీత పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 8, 7 సంవత్సరాల కుమారులు ఉన్నారు. కాగా, సోమవారం మద్యం మత్తులో లక్ష్మణ్ కత్తితో భార్య సునీత గొంతు కోసేశాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందగా తాను కూడా అదే కత్తితో గొంతు కోసుకున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. లక్ష్మణ్ ను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.