మండల ప్రజలకు చాకలి ఐలమ్మ జయంతి శుభాకాంక్షలు*

మండల ప్రజలకు చాకలి ఐలమ్మ జయంతి శుభాకాంక్షలు*

జనం న్యూస్ సెప్టెంబర్ 26. శాయంపేట మండలం_తెలంగాణ తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీర వనిత చాకలి(చిట్యాల) ఐలమ్మ అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చి రెడ్డి అన్నారు. గురువారం ఐలమ్మ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ పోరాటంలో ఐలమ్మ చూపిన తెగువ అందరికీ ఆదర్శమని అన్నారు. గడీల వ్యవస్థపై గలమెత్తి పోరాడిన ఐలమ్మ బహుజన అత్మ గౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీక అని కొనియాడారు. నేటి యువత ఆమెను ఆదర్శంగా తీసుకొని. అవినీతి అన్యాయంపై పోరాడాలన్నారుఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిందం రవి, నిమ్మల రమేష్, మారపెల్లి వరదరాజు, రాజేందర్, మార్కండేయ, బాసాని రవి, చిరంజీవి, రాజయ్య, భిక్షపతి, వెంకటరమణ, వీరన్న, తిరుపతి శంకరాచారి తదితరులు పాల్గొన్నారు._