మట్టి వినాయకులవిగ్రహాలని పూజిద్దాం...పర్యావరణ పరిరక్షిద్దాం..

మట్టి వినాయకులవిగ్రహాలని పూజిద్దాం...పర్యావరణ పరిరక్షిద్దాం..

జనం న్యూస్ 06 సెప్టెంబర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం రిపోర్టర్ దినేష్ : వినాయక చవితి పండుగను పురస్కరించుకొని పూజలో మట్టి విగ్రహాలను వినియోగించి పర్యావరణ పరిరక్షణకు అందరం భాగస్వాములు అవుదామని విశ్వహిందూ పరిషత్ ముస్తాబాద్ మండల అధ్యక్షులు గూడెం దేవేందర్ అన్నారు.అవగాహన కల్పించేందుకు మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేపట్టామన్నారు ఈ సందర్భంగా ఎస్ఐ సిహెచ్ గణేష్ మాట్లాడుతూ మండలంలో మట్టి వినాయక విగ్రహాలను పంచడం అభినందనీయమని,రంగు రంగుల విగ్రహాలు నీటిలో నిమజ్జనం చేస్తే నీరు కలుషితమై అనేక రోగాలు వచ్చే ప్రమాదం ఉందన్నారు.ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను వినియోగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్సై గణేష్,కుమార్, విశ్వహిందూ పరిషత్  బజరంగ్ దళ్ సభ్యులు, గ్రామ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.