శివ్వంపేట ఎస్ఐపై తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డికి పిర్యాదు

శివ్వంపేట ఎస్ఐపై తూప్రాన్  డీఎస్పీ వెంకటరెడ్డికి పిర్యాదు

ఎస్ఐ మహిపాల్ రెడ్డి బూతులు తిడుతున్నారని డీఎస్పీకి బాధితుల వేడుకోలు..

దొంతి గ్రామానికి చెందిన కోదాస్ సత్యనారాయణ దంపతుల పిర్యాదు...


 జనం న్యూస్ అక్టోబర్19.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ 

మెదక్ జిల్లా శివంపేట బర్రె విషయంలో జరిగిన పెద్దల   ఒప్పందం విషయంలో వెళితే గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ మల్లవరం వెంకటరెడ్డి కులం పేరుతో దూషిస్తూ తమ దంపతులపై ఆకారణంగా దాడి చేశారని, వెంకటరెడ్డిపై పిర్యాదు చేయడానికి శివ్వంపేట పోలీస్ స్టేషన్ వెళితే ఎస్ఐ మహిపాల్ రెడ్డి భూతు మాటలు తిడుతూ స్టేషన్ నుండి వెళ్లగొట్టారని,ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని తూప్రాన్ డీఎస్పీ  వెంకటరెడ్డికి శనివారం దొంతి గ్రామానికి చెందిన కోదాస్ సత్యనారాయణ పూలమ్మ దంపతులు పిర్యాదు చేశామని తెలిపారు.  బాధితుల పక్షాన నిలబడాల్సిన ఎస్ఐ మహిపాల్ రెడ్డి అధికార కాంగ్రెస్ నాయకులకు,అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తున్నారని డీఎస్పీకి సత్యనారాయణ దంపతులు పిర్యాదు చేశారు. తనకున్యాయం చేయాల్సిన ఎస్ఐ  అగ్రవర్ణాలకు వత్తాసు పలుకుతున్న విషయాన్నీ మెదక్  జిల్లా ఎస్పీకి కూడ లిఖితపూర్వకంగా పిర్యాదు చేయనున్నట్లు సత్యనారాయణ దంపతులు తెలిపారు. ఈకార్యక్రమంలో దొంతి తాజామాజీ ఎంపీటీసీ కోదాస్ లక్ష్మీకుమార్, తదితరులు పాల్గొన్నారు.