సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె చేపడతాం: మున్సిపల్‌ కార్మికులు

సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె చేపడతాం: మున్సిపల్‌ కార్మికులు

జనం న్యూస్ 02 నవంబర్

విజయనగరం టౌన్ రిపోర్టర్

గోపికృష్ణ పట్నాయక్

సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. సమస్యలను ఎన్నిసార్లు అధికారులు దృష్టికి తీసుకువెళ్లిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నినాదాలు చేశారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోతే సమ్మెకు వెనుకాడబోమని హెచ్చరించారు.