ఆర్టీసీ కండక్టర్ ను చెప్పుతో కొట్టిన మహిళ.. డ్రైవర్ పక్కన కుర్చువద్దు అన్నందుకు దాడి.

జనం న్యూస్: వరంగల్ జిల్లాలో ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్పై మహిళ ప్రయాణికురాలు, ఆమె బంధువులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. మొదట మహిళ ప్యాసింజర్ తో తలెత్తిన వివాదం ముదిరి డ్రైవర్, కండక్టర్ పై దాడికి దారి తీసింది. డ్రైవర్ పక్కన ఉన్న బానెట్ పై కూర్చోవద్దని చెప్పినందుకు మహిళా ప్యాసింజర్ , ఆమె కుటుంబ సభ్యులు బస్సులో వీరంగం సృష్టించారు. వివరాల్లోకి వెళితే.. హనుమకొండ నుంచి ఆర్టీసీ బస్సు ఏటూరు నాగారం వెళ్తుండగా ఆత్మకూరు దగ్గర మహిళా ప్యాసింజర్, డ్రైవర్ కు మధ్య గొడవ మొదలైంది. డ్రైవర్ పక్కన ఉన్న బానెట్ పై కూర్చోవద్దని చెప్పినం దుకు మహిళ ప్యాసింజర్.. డ్రైవర్ తో గొడవకు దిగింది. వివాదం ముదిరడంతో ఆమె కొడుకుకు ఫోన్ చేసింది.. దీంతో ముఫ్పై కిలోమీటర్లు బస్సును వెంబడించి వచ్చిన ఆమె కొడుకు ..బస్సు ఆపి డ్రైవర్, కండక్టర్ తో వాగ్వాదానికి దిగారు. కండక్టరుపై మహిళా ప్యాసింజర్ చెప్పుతో దాడి చేసింది. ఆమె కొడుకు కండక్టర్ మొఖంపై పిడిగుద్దులతో దాడి చేశాడు. దీంతో డ్రైవర్ కండక్టరు.. ఆత్మకూరు పోలీస్ స్టేషన్, ములుగు జిల్లా కేంద్రంలో మహిళా ప్యాసింజర్, ఆమెకు కొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రైవర్,కండక్టర్ విధులకు ఆటంకం కలిగించి, దాడిచేసిన మహిళా ప్యాసింజర్, ఆమె కొడుకు మోహన్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.