ఈతకొసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన యువకుడు

ఈతకొసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన యువకుడు

జనం న్యూస్ చింతపల్లి మండలం: చింతపల్లి మండలం కేంద్రంలో 10-06-2023 రోజు ఉదయం అందాజ 10 గంటల ప్రాంతంలో చింతపల్లి గ్రామ శివారులో గల వర్కాల రోడ్డు వద్ద ఉన్న ఇదం బావి లో ఈతకొట్టడం కొరకు వెళ్లి ప్రాణాలు కోల్పోయినాడు వేముల రాజు తండ్రి వెంకటయ్య, వయసు 18 సంవత్సరాలు, కులం: వడ్డెర, వృత్తి: కూలీ, నివాసం: బొగ్గులదోన గ్రామం ఉండి మండలం. అనునతడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయినాడు. ఇతడు గత వారం రోజుల క్రితం తన ఇంటి నుండి చింతపల్లి గ్రామంలో ఉంటున్న తన మామ అయిన కొమెర తిరుపతయ్య ఇంటికి చుట్టం చూపుగా వచ్చినాడు. మృతుని తండ్రి అయిన వేముల వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదు. మేరకు చింతపల్లి పోలీస్ ఎస్ఐ సతీష్ రెడ్డీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించడం జరిగినది.