ట్రాక్టర్ ప్రమాదంలో బాలుడు మృతి

ట్రాక్టర్ ప్రమాదంలో బాలుడు మృతి

జనం న్యూస్ (10జూన్ 2022) (కేశంపేట మండలం) ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండు సంవత్సరాల బాలుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కొండారెడ్డి పల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది గ్రామస్తులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వట్టెల మల్లేష్ కుమారుడు విష్ణు(2) బాలుడు ఇంటి ముంగిట ఆడుకుంటుండగా కేశంపేట గ్రామానికి చెందిన తిమ్మగళ్ళ మత్తు అనే వ్యక్తి డాక్టర్ను నిర్లక్ష్యంగా నడపడంతో ట్రాలీ టైర్ల క్రింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ధనుంజయ్ తెలిపారు.