కారు బోల్తా ఉపాధ్యాయులకు తప్పిన ప్రమాదం

కారు బోల్తా ఉపాధ్యాయులకు తప్పిన ప్రమాదం

జనం న్యూస్ 26-9-24 అందోల్ నియోజకవర్గం-జిల్లా సంగారెడ్డి 161వ జాతీయ రహదారిపై అందోల్ మండలం పరిధిలోని మాసన్ పల్లి గ్రామ శివారిలోని బైపాస్ రోడ్డు లో జరిగింది. పటాన్ చెరు ప్రాంతాల నుంచి ప్రతిరోజు ప్రవేట్ టాక్సీలో ఆయా పాఠశాలలకు ఆరుమంది ఉపాధ్యాయులు వెళ్తుంటారు ఎప్పటిలాగే సంగుపేట వద్ద ఉన్న హైవే రోడ్డు బ్రిడ్జి పైకి ఎక్కి కొద్ది దూరం వెళ్ళగానే రోడ్డుపై వర్షపు నీరు నిలవడంతో వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డుపైకి పల్టీ కొట్టింది. ఏడు మందికి గాయాలు అయిన సంఘటన తెలిసింది. ఉపాధ్యాయులు నేరేడు గుంట, అక్సాన్ పల్లి గ్రామాలకు విధులకు వెళుచుండగా ప్రమాదవశాత్తు కారు బోల్తా పడగా మధుసూదన్ రెడ్డి, పూర్ణచందర్, రామ్ చందర్, ప్రవీణ, జ్యోతి, వరలక్ష్మి ఉపాధ్యాయులకు కారు డ్రైవర్ కు గాయాలు కాగా వెంటనే చికిత్స నిమిత్తం జోగిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా తీవ్ర గాయాలు తగిలిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం హైదరాబాదుకు తరలించగా స్వల్ప గాయాలు తగిన వారిని ప్రథమ చికిత్స చేశారు. జిల్లా ఉపాధ్యాయ పీ ఆర్టీయూ అధ్యక్షుడు ఏ. మా ణ య్య వెంటనే జోగిపేట ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి ఉపాధ్యాయులతో మాట్లాడి వారి పరిస్థితి తెలుసుకున్నారు.