కొంతాన్ పల్లి అంబేద్కర్ విగ్రహా ఘటన నిందితులను త్వరలోనే పట్టుకుంటాం

కొంతాన్ పల్లి అంబేద్కర్ విగ్రహా ఘటన నిందితులను త్వరలోనే పట్టుకుంటాం

తూప్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి..
ఎస్ఐ మహిపాల్ రెడ్డితో కలిసి అంబేద్కర్ విగ్రహా పరిశీలిన..

పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు చేసిన దళిత సంఘాలు..

 జనం న్యూస్ సెప్టెంబర్18.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్  శివ్వంపేట మండలంలోని కొంతాన్ పల్లి గ్రామంలో గత రెండు రోజుల క్రితం జరిగిన బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహా ధ్వంసం ఘటనలో నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తూప్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి అన్నారు. దుండగుల దుచ్చర్యకు ధ్వంసమైన కొంతాన్ పల్లి అంబేద్కర్ విగ్రహాన్ని ఎస్ఐ మహిపాల్ రెడ్డితో కలిసి బుధవారం పరిశీలించారు. ఈసందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ ఘటనకు సంబందించిన వివరాలన్నీటి కూడ సేకరిస్తున్నామని ఆకాతాయిలను వీలైనంత తొందరలో అరెస్ట్ చేస్తామన్నారు. కొంతాన్ పల్లిలో అంబేద్కర్ విగ్రహా దుర్ఘటనను నిరసిస్తూ జిల్లాలోని దళిత సంఘాల నాయకులు నాయకులు రాస్తారోకో నిర్వహించి దుండగులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం శివ్వంపేట పోలీస్ స్టేషన్ లో లిఖితపూర్వకంగా పిర్యాదు చేశారు.