సుక్కల్ తీర్త్ ఎంపీపీఎస్ పాఠశాలను సందర్శించిన ఎంపీడీవో సత్తయ్య,

సుక్కల్ తీర్త్ ఎంపీపీఎస్ పాఠశాలను సందర్శించిన ఎంపీడీవో సత్తయ్య,

జనం న్యూస్,సెప్టెంబర్ 18,కంగ్టి  
 
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని  
సుక్కల్ తీర్త్ ఎంపీపీ ఎస్ పాఠశాలను బుధవారం ఎంపీడీవో సత్తయ్య, ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా పాఠశాలలో   స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని పురవీధులను సందర్శించారు. అనంతరం  పాఠశాల,అంగన్వాడీ పిల్లలు,ఉపాధ్యాయ సిబ్బందితో కలిసి మానవహారాన్ని నిర్వహించారు. పాఠశాలలో ఆరోగ్యముపై   విద్యార్థులకు క్విజ్  పోటీలు నిర్వహించి  విజేతలైన విద్యార్థులకు నోట్ పుస్తకాలను బహుమతులుగా అందించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో సత్తయ్య మాట్లాడుతూ  స్వచ్ఛతాహి సేవ  కార్యక్రమంలో భాగంగా  ఆరోగ్యము, అంటువ్యాధులు, ప్రబలకుండా     తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవికుమార్, పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు    అంగన్వాడీ టీచర్స్,ఆశ వర్కర్,గ్రామ పెద్దలు యువకులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.