ఘోరం.. ఇంట్లో నుంచి దుర్వాసన.. వెళ్లి చూస్తే వాటర్ ట్యాంక్లో 6 ముక్కలుగా శవం లభ్యం.

ఘోరం.. ఇంట్లో నుంచి దుర్వాసన.. వెళ్లి చూస్తే వాటర్ ట్యాంక్లో 6 ముక్కలుగా శవం లభ్యం.

జనం న్యూస్: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ కసాయి భర్త అనుమానంతో భార్యను దారుణంగా చంపేశాడు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని వాటర్ ట్యాంక్‌లో దాచిపెట్టాడు నిందితుడు. బిలాస్పూర్ సక్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉస్లాపూర్ దగ్గర జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. అయితే, హత్య జరిగిన రెండు నెలల తర్వాత ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. భార్యపై అనుమానంతో భర్త.. హత్య చేశాడని.. ఆ తర్వాత డెడ్‌బాడీని టేపుతో చుట్టేసి వాటర్‌ ట్యాంక్‌లో దాచిపెట్టాడని పోలీసులు తెలిపారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు ట్యాంక్‌లో నుంచి సాతి సాహు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ సంబంధాల కారణంగానే హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. హత్యానేరం కింద మహిళ భర్త పవన్‌సింగ్‌ ఠాకూర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, మహిళ మృతదేహం సింటెక్స్ నీటిలో 6 ముక్కలై లభ్యమైంది. ప్రసుత్తం పోలీసుల అదుపులో ఉన్న పవన్ సింగ్ ఠాకూర్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు బిలాస్పూర్ పోలీసులు తెలిపారు.