రైతులు విత్తనాలు సద్వినియోగం చేసుకోవాలి: ఏవో తులసి రామ్.

రైతులు విత్తనాలు సద్వినియోగం చేసుకోవాలి: ఏవో తులసి రామ్.

జనం న్యూస్ అక్టోబర్ 1, వికారాబాద్ జిల్లా పూడూరు మండలం, యాసంగిలో శనిగలు మరియు కుసుమలు వేసుకునే రైతులకు లాభాదాయకంగా ఉంటుందని, రెండు పంటలు 100 రోజుల్లో కోతకు వస్తుందని, మరియు యాసంగిలో మన ప్రాంతం చాలా అనుకూలంగా ఉంటుందని, ఇందుకోసము ప్రభుత్వ రంగ సమస్త అయినా తెలంగాణ విత్తన కార్పొరేషన్ వారు అగ్రోస్ ద్వారా మంచి నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచారు. కుసుమలు 4కిలోల బ్యాగు ధర 332 , శనిగలు 25 కేజీలు బస్తా ధర 2250, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి తులసి రామ్ తెలిపారు.