తాజా సమాచారం

తాజా సమాచారం

 జనం న్యూస్ 27-9-24 అందోల్ నియోజకవర్గం-జిల్లా సంగారెడ్డి అందోల్ నియోజకవర్గం సింగూర్ ప్రాజెక్టులో భారీగా వరద పోటెత్తింది. ఈరోజు అనగా శుక్రవారం ఉదయం 6 గంటలకు 17,209 క్యూసెక్కులు కాగా ఉదయం 11 గంటలకు 29,546 క్యూసెక్కుల వరద ఉధృతి అధికమించినట్లు ప్రాజెక్ట్ AE మహిపాల్ రెడ్డి వెల్లడించారు. ప్రాజెక్టులోని 6వ, 11వ క్రస్ట్ గేట్ల ద్వారా 2.0 మీటర్ల ఎత్తులో దిగువకు 21,467 క్యూసెక్కుల వరద మంజీరా నదిలో వదిలినట్లు తెలిపారు. నది పరి వాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.